చిరకాలం గుర్తుండిపోయే ఓ సెల్ఫీ విత్ గెరిల్లా|Selfie with Gorilla

చిరకాలం గుర్తుండిపోయే ఓ సెల్ఫీ విత్ గెరిల్లా|Selfie with Gorilla

కాంగోలోని విదులగ నేషనల్ పార్కులో ఫారెస్ట్ గార్డులు దిగిన సెల్ఫీని
ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అంతరించిపోతున్న గెరిల్లా జాతులను కాపాడుతూ
చాలా మంది ఫారెస్ట్ గార్డులు తమ ప్రాణాలు పణంగా పెట్టారు. గెరిల్లాలకు ఆవాసంగా
ఉన్న విదుంగ నేషనల్ పార్కులో శుక్రవారం
(ఏప్రిల్ 25) ఒక్క
రోజే
13 ఎకో ఫారెస్ట్ గార్డులు వేటగాళ్ల చేతిలో ప్రాణాలు
కోల్పోయారు. గత
20 ఏళ్లలో 180 మందికి
పైగా గార్డులు  వేటగాళ్లను ప్రతిఘటిస్తూ
వారి చేతిలో చనిపోయారు. గోరిల్లాలతో ఇద్దరు ఎకో ఫారెస్ట్ గార్డులు దిగిన ఫొటో.. సెల్పి
 ఆఫ్ సెంచగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం
లేదు. విధులు నిర్వర్తిస్తూ గెరిల్లాలను రక్షించేందుడు ప్రాణాలు పణంగా పెడుతున్న
గార్డులకు సెల్యూట్ చేయాల్సిందే. ఈ సెల్ఫీని గుర్తు చేస్తూ ఐ యఫ్ ఎస్ అధికారి
పర్వీన్ కాస్వాన్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *